Intinti Gruhalakshmi june 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో తులసి గట్టిగా సమాధానం చెప్పడంతో నందు అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ తన ఇంట్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉండగా ఇంతలో శృతి ఒట్టి చేతులతో వచ్చి ప్రేమ్ ని చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్, అసలు విషయం అర్థం చేసుకొని శృతిని దగ్గర తీసుకుని ఓదారుస్తాడు. అప్పుడు డబ్బులు ఇవ్వనందుకు నేను ఇంతగా బాధపడుతుంటే డబ్బులు పోయినందుకు ఆంటీ ఇంకా ఎంత బాధ పడుతుందో అని అనుకుంటూ ఉంటుంది.
మరొకవైపు తులసి ఒంటరిగా కూర్చొని తన బాధలు గులాబీ మొక్క తో పంచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించి ఆ రంజిత్ గురించి ఎంక్వయిరీ చేయడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే ఒక ఆఫీసర్ కి ఫోన్ చేసి రంజిత్ గురించి అడగగా అతను ఎవరో తెలియదు అని చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగుతుంది.
రంజిత్ ని ఎలా అయినా పెట్టుకోవాలి సమస్యను తీసుకోవాలి అనుకుంటుంది. మరొకవైపు అభి దగ్గరికి వెళ్లిన గాయత్రీ ఎన్నాళ్ళని ఇలానే ఉంటారు అని అనగా వెంటనే అవి మరి నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాలా అని అనడంతో వెంటనే గాయత్రి అలా కాదు అవి అంకితను ఇంటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయు అని అంటుంది.
మీ మమ్మీ లోన్ ఈ విషయంలో డబ్బులు పోగొట్టుకుంది అని అనగా అప్పుడు అభి లో లోపల సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు గాయత్రి ఎలా అయినా అంకితం ఇంటికి తీసుకురావాలి అని అనగా వెంటనే అభి ఇప్పుడే వద్దు అంకిత మామ్ కి డబ్బులు ఇవ్వను అని చెప్పింది. కానీ పరిస్థితిల వల్ల తన డబ్బులు ఇస్తే మాత్రం అప్పుడు మనం గట్టిగా అడిగే హక్కు ఉంటుంది అంతవరకు సైలెంట్ గా ఉందాం అనడంతో గాయత్రి కూడా సరే అని అంటుంది.
మరొక వైపు నందు ఇంటర్వ్యూ బయలుదేరుతూ ఉండగా ఇంతలో లాస్య వచ్చి డబ్బులు ఇవ్వడం తో వెంటనే నందు ఎన్ని డబ్బులు ఎక్కడివి అని అడగగా లాస్య అబద్ధం చెప్పినందుకు డబ్బులు ఇస్తుంది. ఈ క్రమంలోనే లాస్య ఏడుస్తున్నట్లు నటిస్తుంది. మరొకవైపు తులసి రంజిత్ కోసం ఎంక్వయిరీ చేస్తూ ఉంటుంది.
ఆ రంజిత్ ని ఎలా అయినా పట్టుకుంటే అసలు విషయాలు బయటకు వస్తాయి అని తులసిఅతని కోసం వెతుకుతూ ఉంటుంది. తులసికి జరిగిన విషయం గురించి తలచుకొని లాస్య,భాగ్య ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు భాగ్య లాస్యని మరింత రెచ్చగొడుతూ తులసి అతను అంత తక్కువ అంచనా వేయొద్దు తను చేసే ప్రయత్నాలు చేస్తుంది అనడంతో అప్పుడు లాస్య కాస్త ఆలోచనలో పడుతుంది.
రేపటి ఎపిసోడ్ లో బ్యాంకు మేనేజర్ వచ్చి తులసిని ఇది క్రిమినల్ అని అంటూ ఉండడంతో అప్పుడు అంకితం నా పేరు మీద కోట్ల ఆస్తి డిపాజిట్ చేశారు ఆ షూరిటీ సంతకం నేను పెడతాను అని చెప్పి సంతకం పెడుతుంది. ఇక ఆ తర్వాత గాయత్రి అక్కడికి వచ్చి అంకిత అలా చేసినందుకు రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World