Nagababu : మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలపై అభిమానులంతా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంపై స్పందిస్తూ… తప్పు ఎరు చేసినా సరే.. ఒకసారి క్షమాపణలలు కోరితే క్షమించంి. అది మన మెగా జనసైనికుల ధర్మ. కాబట్టి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను వయసును దృష్టిలో పెట్టుకొని ఆయనను ట్రోల్ చేయడం మానుకోండి అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామ రాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చిరంజీని ఆహ్వానించడంపై నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. వీటిని తాను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. “నా వ్యాఖ్యలతో చిరంజీవి అబిమానులు, కాపు మహానాడు నేతలు కొంత మంది బాధ, మరికొంత మందికి ఆవేశం కల్గింది. వారి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉంటే విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. నా భాషను మించి చిరంజీవి గురించి మాట్లాడిన దాన్ని భాషా దోషంగా పరిగణించాలి. ఆ అంశాన్ని ఇక్కడితో వదిలేయాంటూ” మీడియా సమావేశంలో తెలిపారు.
Read Also : Pawan kalyan: పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. వైరల్ ఫీవర్ రావడంతో విశ్రాంతి!