Extramarital Affair: వివాహేతర సంబంధం పెట్టుకుందని.. చెప్పుల దండ వేసి ఊరేగింపు!

Extramarital affair: కొంత మంది మహిళలు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి అయ్యాక, ఒకరిద్దరూ పిల్లలు కలిగాక కూడా ఆ సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అత్త మామలతో ఉంటే ఆ సంబంధానికి అడ్డు వస్తారని… బలవంతంగా భర్తతో వేరు కాపురం పెట్టిస్తున్నారు. పని పైన భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్లగానే ప్రియుడిని ఇంటికే పిలిపించి పడక సుఖం పొందుతున్నారు. కొందరు భర్తకు తెలియకుండా చాటు మాటుగా అలాంటి పనులు చేస్తున్నారు. కొందరు భర్తలకు తమ పెళ్లాలు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసినా… బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని తమలో తామే కుమిలి పోతున్నారు. దీనిని కూడా పెళ్లాలు వాడుకుంటూ మరింత నీచానికి తెగబడుతున్నారు.

Advertisement

కాలేజీ అబ్బాయిలతో, పక్కింటి వ్యక్తులతో, స్నేహితులతో, పాత బాయ్ ఫ్రెండ్స్ తో ఆ సంబంధం పెట్టుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అడ్డమైన పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు.. ఇలాంటి అఫైర్స్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటనలు వార్తల్లో చాలా మంది చూసే ఉంటారు. మరి కొందరైతే భర్తకు తన నీచమైన పని గురించి తెలియగానే పిల్లా పాపలను వదిలేసి ప్రియుడితో వెళ్లి పోతున్నారు. మరికొందరు ఆ సుఖానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను కూడా చంపేస్తున్నారు.

అలాంటి ఓ ఘటననే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఆ భర్త చేసిన పనిని కొందరు మెచ్చుకుంటున్నారు. మరి కొందరేమో విమర్శిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మధ్య ప్రదేశ్ లోని దేవాస్ జిల్లా బోర్ పదవ్ లో గిరిజన తెగకు చెందిన 32 ఏళ్ల మహిళకు ముగ్గురు పిల్లలు. కొన్ని రోజుల క్రితం ఆమె ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు చాలా వెతికారు. ఈ క్రమంలోనే ఆమె తన ప్రియుడితో ఉన్నట్లు తెలుసుకున్న భర్త.. ఆ సమయంలో వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకున్నాడు.

Advertisement

ప్రియుడితో తన భార్య ఆ స్థితిలో ఉండటం చూసి రగిలి పోయాడు. ఆమెను మెడ పట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. అందరి ముందే ఆమె జుట్టు పట్టుకుని కొట్టాడు. చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించాడు. మహిళ భర్త ఆమెపై ఎక్కి కూర్చుని.. ఊరంతా తిరిగాడు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement